గ్రామాల్లో గట్టి నిఘా
భైంసా రూరల్ సీఐ చంద్రశేఖర్
మహాగాంలో కార్డన్ సెర్చ్
భైంసా టౌన్, ఏప్రిల్ 23 : ప్రజల సంక్షేమం, రక్షణ కోసం పోలీసులు అహర్నిశలు కృషిచేస్తున్నారని భైంసా రూరల్ సీఐ చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని మహాగాంలో శుక్రవారం రూరల్ పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఉదయాన్నే ఇంటింటా సోదాలు చేశారు. దీంతో ఏం జరుగుతుందో తెలియక గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. వాహన పత్రాలు, ఆధార్కార్డులను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ మాట్లాడారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు సాగించే అవకాశం లేకుండా నిఘా ఏర్పాటు చేసి, గట్టి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పత్రాలు లేని 117 ద్విచక్రవాహనాలు, 8 ట్రాక్టర్లు, 4 ఆటోలు, కారు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.20 వేల విలువ గల మద్యం సీసాలను సీజ్ చేశారు. కార్డన్ సెర్చ్లో రూరల్ ఎస్ఐ పున్నం చందర్, 161 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
క్యూఆర్ కోడ్పై అవగాహన…
షీ టీమ్ ద్వారా క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించా రు. మహిళలు సమస్యలో ఉన్నప్పుడు ఈ క్యూ ఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా తక్షణ సా యం అందుతుందని తెలిపారు. బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి ఎవరైనా ఏటీఎం, పిన్ నంబర్, ఓటీపీ అడిగితే చెప్పవద్దని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే బ్యాంక్కు వెళ్లాలన్నారు.
ఇవి కూడా చదవండి
IPL 2021: పదో ఓవర్లో ఫస్ట్ సిక్స్..రోహిత్ ఫిఫ్టీ
కరోనాతో బీజేపీ ఎమ్మెల్యే మృతి.. భార్యకు సైతం సోకిన వైరస్