న్యూఢిల్లీ: దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆశా వర్కర్లు దయనీయ పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారంటూ అందిన ఫిర్యాదుపై కేంద్రానికి, రాష్ర్టాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) నోటీసులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా గ్రామీణ జనాభా ఆరోగ్య నిర్వహణ వ్యవస్థ ఆశా వర్కర్లపైనే ఆధారపడి ఉందని పేర్కొంది. వారు విధి నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటుండటం నిజమే అయితే తీవ్ర సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేసింది.‘ఫ్రంట్లైన్ వర్కర్లు’గా ఆశాలు సేవలందిస్తున్నా వారికి రక్షణ సామగ్రి ఇవ్వడం లేదన్న ఫిర్యాదుపై స్పందించి… ఈ నోటీసులు ఇచ్చింది.