కావలసిన పదార్థాలు
మినుప పప్పు: ఒక కప్పు, పచ్చిమిర్చి: నాలుగు, జీలకర్ర: ఒక టీస్పూన్, అల్లం: రెండు అంగుళాల ముక్క, కరివేపాకు: రెండు రెమ్మలు, మిరియాల పొడి: అర టీస్పూన్, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా.
తయారీ విధానం
మినుప పప్పును బాగా కడిగి ఎనిమిది గంటలపాటు నానబెట్టాలి. నానిన పప్పును మెత్తగా రుబ్బుకుని చిన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, మిరియాలపొడి, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలపాలి. స్టవ్మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత పప్పు మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని గారెలు వేసుకుని దోరగా కాల్చుకుంటే నైవేద్యానికి అల్లం వడలు సిద్ధం.