హర్షితా బొంబానీ అనే ముద్దుగుమ్మ ‘మిస్ ఎకో ఇండియా – 2020’ కిరీటాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. తను మిస్ ఇంటర్నేషనల్ పోటీల్లోనూ పాల్గొననుంది. నేటి నుంచి ఈ పోటీలు ఈజిప్ట్ వేదికగా జరుగనున్నాయి. 70 దేశాల నుంచి 70 మంది అతివలు పాల్గొననున్నారు. మన దేశం తరఫున జైపూర్కు చెందిన ఈ కాలేజీ విద్యార్థిని పాతినిధ్యం వహిస్తున్నది. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ పోటీలో.. విజేతలకు ఒక ఏడాదిపాటు ఐక్యరాజ్య సమితి ‘గుడ్విల్ అంబాసిడర్’ హోదా దక్కుతుంది. ‘ఈ వేదికద్వారా ప్రపంచానికి నా గొంతు వినిపించే అవకాశం దక్కింది. ఈ సదవకాశాన్ని వినియోగించుకుని పర్యావరణం కోసం పాటు పడతా’ అంటున్నది హర్షిత. ఇప్పటి వరకూ భారతీయులెవరూ మిస్ ఎకో ఇంటర్నేషల్ కిరీటాన్ని దక్కించుకోలేదు. ఈసారైనా సౌందర్య మకుటం మనల్ని వరిస్తుందేమో చూడాలి మరి.