కావలసిన పదార్థాలు
ఖర్జూర: 20, బాదం/జీడిపప్పు: పది, బెల్లం: పావుకప్పు,
పాలు: రెండు కప్పులు, యాలకుల పొడి: పావు టీస్పూన్,
బియ్యం: ఒక టేబుల్ స్పూన్, నెయ్యి: ఒక టేబుల్ స్పూన్
తయారీ విధానం
ముందుగా ఖర్జూరాల నుంచి గింజలు వేరుచేసి, నిలువుగా రెండు ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బియ్యం, బాదం లేదా జీడిపప్పులను పావు కప్పు పాలలో అరగంటపాటు నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్మీద కడాయి పెట్టి, నెయ్యి వేడయ్యాక ఖర్జూర ముక్కలు వేయాలి. ఐదు నిమిషాలపాటు వేయించి చల్లార్చాలి. మిక్సీజార్లో ఖర్జూర ముక్కలు, నానబెట్టిన బాదం పప్పు, బియ్యాన్ని పాలతోపాటు వేసి, మరోకప్పు పాలు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. స్టవ్మీద మిగిలిన పాలను పెట్టి ఖర్జూర మిశ్రమం వేయాలి. ఆ మిశ్రమం ఉడుకుతుండగా తరిగిన బెల్లం వేసి దగ్గరపడే వరకు కలుపుతూ ఉండాలి. చివరగా యాలకుల పొడి చల్లుకుని సర్వ్ చేసుకొంటే ఖర్జూర ఖీర్ రెడీ!