జైపూర్: రాజస్థాన్లోని రణతంబోర్ నేషనల్ పార్కులో ఓ ఐదు నెలల పులి పిల్ల చనిపోయింది. గాంధ్రా దేహ హిల్లే అటవీ ప్రాంతంలో పులిపిల్ల ముక్కలుగా ఉన్న స్థితిలో అటవీ అధికారులు గుర్తించారు. ఓ పెద్ద పులి దానిని గాయపరచడంతోనే అది మరణించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఐదు నెలల ఆ పిల్ల మెడపై పంజా గుర్తులు ఉన్నాయని ఫీల్డ్ డైరెక్టర్ టీసీ వర్మ వెల్లడించారు. పోస్టుమార్టం అనంతరం దానిని పూడ్చిపెట్టామని తెలిపారు. ఆ పులిపిల్ల చివరిసారిగా మార్చి 26న తన తల్లితో (టీ-60) తిరుగుతూ కనిపించిందని వెల్లడించారు.
కాగా, ఒడిశాలోని నందన్కానన్ జులాజికల్ పార్కులో గత ఆదివారం ఓ తెల్ల పులి మూడు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ పులి పేరు విజయ అని, దానికి ఇది మూడో ఈత అని అధికారులు చెప్పారు. ఆదివారం ఉదయం 10.58 గంటలకు తొలుత ఒక పిల్లను, మధ్యాహ్నం 1 గంటలకు, మళ్లీ 1.35 గంటలకు మరో రెండు కూనలకు జన్మనిచ్చింది. గతంలో 2016, ఆగస్టు 20న రెండు పిల్లలకు, 2017, సెప్టెంబర్ 17 మరో రెండు పిల్లలకు జన్మనిచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..