ఇద్దరు అమ్మాయిలు కలిసి ఒక స్టార్టప్ మొదలు పెట్టడంలో ఆశ్చర్యం ఏమీ ఉండకపోవచ్చు. కానీ, ఢిల్లీకి చెందిన అస్తా భట్నాగర్, దీప్తి దగ్గల్ల కథ కాస్తంత వేరుగా ఉంటుంది. వాళ్లిద్దరూ చిన్నప్పుడు మూడో తరగతిలో స్కూల్లో కలిశారు. మంచి ఫ్రెండ్స్ అయ్యారు. తర్వాత ఇద్దరూ వేర్వేరు స్కూళ్లకు వెళ్లిపోయారు. సరిగ్గా 33 ఏండ్ల తర్వాత సోషల్ మీడియాద్వారా మళ్లీ కలిశారు. తర్వాత ఇద్దరూ కలిసి ‘రంగ్ సంగ్’ పేరుతో హ్యాండ్ పెయింటెడ్ వస్తువులను మార్కెట్లో అమ్మడం ప్రారంభించారు. ‘మేమిద్దరం ఒకరోజు ‘సెలెక్ట్ సిటీ వాక్ షాప్లో కాఫీ తాగడానికి వెళ్లాం. ఇద్దరికీ పెయింటింగ్పై ఆసక్తి ఉన్నట్లు తెలుసుకున్నాం.
అలా ఇద్దరం కలిసి, ఒక స్టార్టప్ మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాం. 2020 ఫిబ్రవరిలో మొదటి ఆర్డర్ని ఎక్స్పోర్ట్ చేశాం. మా హ్యాండ్మేడ్ వస్తువులను లండన్, దుబాయ్, అమెరికాలకు కూడా పంపాం’ అంటున్నది దుగ్గల్. అయితే, గతేడాది మార్చిలో లాక్డౌన్ మొదలైనప్పట్నించీ వీళ్లిద్దరూ తమ ఆర్ట్ బిజినెస్ని ఆన్లైన్ద్వారానే నిర్వహిస్తున్నారు. ‘లాక్డౌన్వల్ల ఇళ్లలో పనిచేసే చాలామంది ఆడవాళ్లకు ఉపాధి లేకుండా పోయింది. అయితే మా చుట్టుపక్కల వున్న కొంతమందికి పెయింటింగ్లో, ప్రొడక్ట్ ప్యాకింగ్లో ట్రైనింగ్ ఇచ్చాం. మాతోపాటు వాళ్లూ ఎంతోకొంత సంపాదిస్తున్నారు” అని చెప్తున్నది భట్నాగర్.