కావలసిన పదార్థాలు
ఆలుగడ్డలు: రెండు (పెద్దవి), మైదా: అర కప్పు, కార్న్ఫ్లోర్: రెండు టేబుల్ స్పూన్లు, బియ్యపు పిండి: రెండు టీస్పూన్లు, ఉప్పు: తగినంత, పెరుగు: ఒక కప్పు, ఉల్లిగడ్డ: ఒకటి (చిన్నది), పచ్చిమిర్చి: నాలుగు, వెల్లుల్లి రెబ్బలు: రెండు, కరివేపాకు, కొత్తిమీర తురుము: కొద్దిగా, నూనె: తగినంత, ఫుడ్కలర్ (రెడ్): రెండు చుక్కలు, జీలకర్ర: అర టీస్పూన్, కారం: ఒక టీస్పూన్, జీలకర్ర, ధనియాల పొడి: ఒక టీస్పూన్
తయారీ విధానం
ముందుగా ఆలుగడ్డలను తొక్క తీసి, అంగుళం ముక్కలుగా కోసి, ఐదు నిమిషాలపాటు ఉడికించి నీళ్ళు వంపి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో మైదా, కార్న్ఫ్లోర్, బియ్యపు పిండి, తగినంత ఉప్పు, ఫుడ్ కలర్ వేసి బాగా కలిపి ఉడికించిన ఆలూ ముక్కలను వేయాలి. నీళ్ళు పోయకుండా ముక్కలకు పిండి మిశ్రమం పట్టేలా బాగా కలపాలి. స్టవ్మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనెపోసి వేడయ్యాక, ఆలూ ముక్కలను వేసి మామూలు మంటమీద పది నిమిషాలపాటు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్మీద మరో పాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, తరిగిన వెల్లుల్లి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి వేయించాలి. అన్నీ బాగా వేగిన తర్వాత కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, పెరుగు వేసి రెండు నిమిషాలు సన్నని మంటమీద ఉడికించాలి. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న ఆలు ముక్కలను వేసి బాగా కలుపుకొని పైనుంచి కొత్తిమీర, కరివేపాకు వేసి సర్వ్ చేసుకుంటే సరి.