హైదరాబాద్: రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతం పరిసరాల్లోని ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం దగ్గర అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక వర్షాలు కురుస్తాయని, 11, 12, 13 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల అతిభారీ వర్షాలు కురువొచ్చని పేర్కొన్నది.