పవన్ కల్యాణ్ ఎప్పుడు రాజకీయాల్లోకి వెళ్తున్నాడో..ఎప్పుడు సినిమాలకు టైం ఇస్తున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. మరీ ముఖ్యంగా ఆయనతో సినిమాలకు కమిట్ అయిన నిర్మాతలు మాత్రం చాలా కంగారు పడుతున్నారు. వకీల్ సాబ్ సినిమా విడుదలయ్యే ముందు వరకు కూడా సినిమాలతో బిజీగా ఉన్నాడు పవన్ కల్యాణ్. గత ఏడాది కరోనా సమయంలో కూడా పాలిటిక్స్ పై ఎక్కువగా ఫోకస్ చేశాడు. అయితే ఆ తర్వాత పూర్తిగా సినిమాల వైపు వచ్చాడు పవర్ స్టార్. కొన్ని రోజులుగా సినిమా హీరోగానే ఉన్నాడు. అయితే ఇప్పుడు ఉన్నట్టుండి మళ్లీ ఆయనలోని రాజకీయ నాయకుడు బయటికి వచ్చాడు. ప్రస్తుతం మళ్లీ జనాల్లోకి వచ్చాడు జనసేనాని. అమరావతి పర్యటనలో ఉన్నాడు పవన్ కల్యాణ్. అక్కడ ప్రజల బాగోగులు తెలుసుకుంటున్నాడు.
కరోనా వైరస్ కారణంగా చనిపోయిన కుటుంబాలను కూడా పరామర్శిస్తున్నాడు పవన్ కల్యాణ్. ఇదిలా ఉంటే పవన్ అక్కడికి వచ్చిన విషయం తెలుసుకొని వేలాది మంది జనసేన కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అంతే కాదు ఎంతో మంది నిరుద్యోగులు, విద్యార్థి సంఘాలు వచ్చి పవన్ కల్యాణ్ ను జనసేన కార్యాలయంలో కలిశారు. అన్న వచ్చాడు.. జాబ్ ఇస్తాడు అంటూ ఎన్నికలకు ముందు జగన్ హామీలు ఇచ్చారని.. కానీ ఇప్పుడు వాటిలో ఒకటి కూడా నిలబెట్టుకోలేకపోయారు అంటూ జనసేనానికి తమ గోడు వెళ్లబోసుకున్నారు నిరుద్యోగులు.
అంతా బాగానే ఉంది కానీ పవన్ మళ్ళీ ఎప్పుడు సినిమాల వైపు వస్తాడు అంటూ ఆసక్తిగా అడుగుతున్నారు నిర్మాతలు. తాజాగా ఈయన రానా కాంబినేషన్ లో చేస్తున్న అయ్యప్పనుమ్ కొషియుమ్ రీమేక్ షూటింగ్ మొదలు పెట్టానున్నాడు. దాంతోపాటు మరో మూడు సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి. 2023 వరకు పవన్ కల్యాణ్ డైరీ ఫుల్ అయిపోయింది. ఇలాంటి సమయంలో మళ్లీ రాజకీయాలంటూ వెళ్లడంతో నిర్మాతలు కంగారు పడుతున్నారు. పవన్ మళ్లీ పూర్తిస్థాయిలో సినిమాలకు టైం ఎప్పుడు కేటాయిస్తాడో అంటూ టెన్షన్ పడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
100 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు..వారికి నా సమాధానమదే: దివి
శ్రియా శరణ్ కథక్ డ్యాన్స్ కు ఫ్యాన్స్ ఫిదా..వీడియో
భర్తతో పబ్లిక్ రొమాన్స్..శ్రియపై నెటిజన్ల సెటైర్లు
పాపులర్ బ్రాండ్ తో ‘అందాల రాక్షసి’ డీల్
విడుదలకు ముందే ఖర్చులు వచ్చేశాయి..!
చీరలో ఆదాశర్మ మార్షల్ ఆర్ట్స్..వీడియో వైరల్