కరీంనగర్, 6 జూలై:భారతదేశంలో అతిపెద్ద సంతానోత్పత్తి చికిత్ససంస్థలలో ఒకటైన ఇందిర ఐవీఎఫ్, తెలంగాణా రాష్ట్రంలోని కరీంనగర్లో ఔత్సాహిక తల్లిదండ్రుల కోసం తమ తలుపులను తెరిచింది. రోగులకు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా కలిగిన ఫెర్టిలిటీ కేంద్రం తెలంగాణాలో తమ 5వ కేంద్రాన్ని ప్రారంభించినట్లయింది. ఈ కేంద్రం ప్రారంభించడం ద్వారా భారతదేశంలో సంస్థ కేంద్రాల సంఖ్య 96కు పెరిగింది. తెలంగాణా రాష్ట్రంలో హైదరాబాద్, సికింద్రాబాద్ , వరంగల్లలో సంస్థ కేంద్రాలున్నాయి. వీటి ద్వారా 1000 కు పైగా జంటలకు మాతృత్వపు కలలను సాకారం చేసింది.
గత దశాబ్ద కాలంలో దేశంలో ఒక లక్షకు పైగా ఐవీఎఫ్ సైకిల్స్ను ఇందిర ఐవీఎఫ్ నిర్వహించింది. తద్వారా 85వేలకు పైగా జంటలకు గర్భం దాల్చేందుకు తోడ్పడింది. అత్యాధునిక సాంకేతికత తోడుగా విస్తృతస్థాయిలో వైద్య నిపుణులు,ఐవీఎఫ్ స్పెషలిస్ట్లు నైపుణ్యం జోడించి ఈ సంస్థ అసాధారణ విజయశాతాన్ని తమ ప్రక్రియల వ్యాప్తంగా సాధించింది. అత్యాధునిక సహాయక పునరుత్పత్తి సాంకేతికతలైనటువంటి ఎలక్ట్రానిక్ విట్నెసింగ్ సిస్టమ్స్, క్లోజ్డ్ వర్కింగ్ చాంబర్స్, ఆర్టిఫిషీయల్ ఇంటిలిజెన్స్, మైక్రోఫ్లూయిడిక్స్,మరెన్నో సౌకర్యాలున్నాయి. దేశ వ్యాప్తంగా తెలంగాణా రాష్ట్రంలోని సంతానం లేని జంటలకు అత్యుత్తమ చికిత్సావకాశాలను అందిస్తున్నాయి.
ఈ సందర్భంగా డాక్టర్ క్షితిజ్ ముర్దియా, సీఈవో అండ్ కో–ఫౌండర్, ఇందిరా ఐవీఎఫ్ మాట్లాడుతూ ‘‘కరీంనగర్లో మా కేంద్రాన్ని ప్రారంభించడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. మారిన జీవనశైలి, వివాహ వయసు పెరగడం, ఆలస్యంగా సంతానం కోసం ప్రణాళిక చేయడం, పెరుగుతున్న ఒత్తిడి వంటి వాటి వల్ల జంటలు సహజసిద్ధంగా గర్భందాల్చడంలో తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి. సంతానోత్పత్తి పరంగా ఆర్ధిక భారాన్ని తగ్గించేందుకు తగిన ప్రయత్నాలను చేయడంతో పాటుగా తెలంగాణా, కరీంనగర్ వాసులకు సహాయపడటాన్ని అతి కీలకాంశంగా భావిస్తున్నాం”అని అన్నారు.