ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: సంవత్సరాల పాటు ఎన్నో కష్టాలను అధిగమించి భారత అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించారని, దేశమంతా వారికి మద్దతు తెలుపాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం మన్ కీ బాత్లో మాట్లాడిన ఆయన అథ్లెట్లను ప్రశంసించారు. ‘ప్రతీ అథ్లెట్ ఎన్నో సంవత్సరాలు కృషి చేసి ఒలింపిక్స్కు అర్హత సాధించారు. వారు దేశం కోసం బరిలోకి దిగుతున్నారు. అందుకే అథ్లెట్లపై ఎలాంటి ఒత్తిడి పెట్టకూడదు. పూర్తి మద్దతు తెలుపాలి’ అని మోదీ అన్నారు. కాగా జూలై 23న టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి.