ప్రైవేటీకరణ దిశగా రెండు ప్రభుత్వ బ్యాంకులు
న్యూఢిల్లీ, జూన్ 8: ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ సజావుగా సాగేందుకు ఉద్యోగుల మద్దతు చాలా అవసరమని గుర్తించినట్లుంది మోదీ సర్కారు. అందుకే రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ కోసం ఉద్యోగులకు ఆకర్షణీయమైన స్వచ్చంధ పదవీ విరమణ పథకాన్ని (వీఆర్ఎస్) తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే బ్యాంకుల్లో వాటాల విక్రయానికి కేంద్రం సిద్ధమైంది. దీంతో ఆకట్టుకునే ప్యాకేజీలతో ఉద్యోగులను ముందస్తు రిటైర్మెంట్ వైపు తీసుకెళ్లాలని చూస్తున్నట్లు తెలుస్తున్నది. కాగా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియాలను ప్రైవేటీకరించేందుకు కేంద్రం పావులు కదుపుతున్నది.