న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్ లో పొందుపరిచిన మెగా ప్రైవేటీకరణ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ)లో వాటా విక్రయానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రణాళికలను ఖరారు చేయనుంది. ప్రైవేటీకరణ కోసం నీతి ఆయోగ్ ఈ రెండు బ్యాంకుల పేర్లను సిఫార్సు చేసింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ)లోనూ ప్రభుత్వ వాటాను విక్రయించే ప్రతిపాదనలపై కసరత్తు సాగుతున్నట్టు సమాచారం. నీతి ఆయోగ్ ప్రతిపాదనపై ఈ దిశగా పెట్టుబడుల ఉపసంహరణ, ఆర్థిక సేవల శాఖలు సమీక్షిస్తున్నాయని తెలిసింది.
ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా నీతి ఆయోగ్ సిఫార్సు చేసే సేవలను మంత్రిత్వ శాఖలతో కూడిన అధికారుల కమిటీ, మంత్రుల గ్రూప్ పరిశీలించి అనంతరం మంత్రి మండలి ఆమోదానికి నివేదిస్తారు. మరోవైపు ఆర్థిక సేవల శాఖ ప్రతిపాదనపై తాము కసరత్తు సాగిస్తున్నామని, ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు అవసరమైన చట్ట సవరణలపైనా చర్చిస్తున్నామని ప్రభుత్వ ఆస్తుల విక్రయాన్ని పర్యవేక్షించే పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం పేర్కొంది. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వాటా విక్రయానికి ప్రణాళికలు ఖరారు చేసే ముందు ప్రభుత్వం ఆర్బీఐని కూడా సంప్రదించనుంది.