యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ప్రధానాలయం పసిడి వర్ణపు కాంతులతో బుధవారం రాత్రి ధగధగలాడింది. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి ప్రత్యేకంగా తయారు చేసిన లైటింగ్ను ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, బెంగళూరు లైటింగ్ టెక్నాలజీ బృందం బుధవారం రాత్రి ట్రయల్ రన్ నిర్వహించారు. దీంతో యాదాద్రి ఆలయం బంగారు వర్ణాన్ని సంతరించుకుని మహాద్భుతంగా దర్శనమిచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి