ఇది భావితరాలకు పర్యాటక ఆస్తి
కరీంనగర్ను హరితవనంగా మార్చడంలో పోలీసుల కృషి అభినందనీయం
మంత్రి గంగుల కమలాకర్ lసీటీసీలో రాతి వనం ప్రారంభం
రాంనగర్, మే 24: పోలీస్ కమిషనరేట్ పోలీసు శిక్షణ కేంద్రం (సీటీసీ)లోని రాక్గార్డెన్ బాగుంన్నదని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఒకప్పటి కాంక్రీట్ జంగల్లాంటి ప్రాంతాన్ని హరితవనంగా తీర్చిదిద్ది, భావితరాలకు పర్యాటక ఆస్తిని అందించడంలో పోలీసుల కృషి అభినందనీయమని ప్రశంసించారు. సోమవారం నూతన ప్రాజెక్టుల్లో భాగంగా సీటీసీలో నిర్మించిన రాక్ గార్డెన్ (రాతివనం)ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, చిన్న గుట్ట ప్రాంతాన్ని వివిధ ప్రభుత్వశాఖలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రముఖ శిల్పుల సేవలను సద్వియోగం చేసుకుని రాక్ గార్డెన్ను నిర్మించడం అద్భుతమన్నారు. ఓ వైపు శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటూనే, మరో పక పర్యావరణ పరిరక్షణపై మక్కువతో ఇలాంటి బృహత్తర కార్యక్రమానికి పోలీస్శాఖ శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. రాక్గార్డెన్లోని ఇనుప, సిమెంట్, లప్పంతో చేసిన కళాఖండాలు, వివిధ రకాల పేయింటింగ్లను పరిశీలించారు. చేపల కేంద్రం, గ్రామాల్లో ఉండే చేదబావి, పశువుల పెంపక కేంద్రం, గడ్డివాములు, ఎడ్లబండి, పల్లె వాతావరణాన్ని కండ్లకు కట్టేలా చేసిన కళాకృతులను ఆసక్తిగా తిలకించారు. అలాగే సీటీసీలో మియావకీ ప్రాజెక్ట్-1,2తోపాటు అన్ని రకాల వనాలను సందర్శించారు. ఇక్కడ వివిధ రకాల రాశులు, వాటి నక్షత్రాల మొకలను కూడా ఏర్పాటు చేయగా, మంత్రి తనరాశి, నక్షత్రం మొకలను పరిశీలించారు.
అనంతరం సీపీ కమలాసన్రెడ్డి మాట్లాడుతూ, ప్రజాప్రతినిధులు, వివిధ ప్రభుత్వశాఖలకు చెందిన అధికారులు అందిస్తున్న సహకారంతో ఇదంతా సాధ్యమైందని చెప్పారు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం సీటీసీ ఆవరణలో 60వేలకు పైగా మొకలు పెంచుతున్నామని, గత హరితహారంలో నాటిన మొకలు వృక్షాలుగా మారాయని చెప్పారు. రాబోయే వర్షాకాలంలో 5 నుంచి 6వేల మొకలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. సీటీసీతో పాటు కమిషనరేట్లోని వివిధ పోలీస్స్టేషన్లు, సరిళ్లు, డివిజన్ కేంద్రాల్లోని కార్యాలయాల ఆవరణలతో పాటు పోలీస్శాఖకు చెందిన స్థలాల్లో మొకలను నాటనున్నట్లు చెప్పారు. ఇక్కడ నగర మేయర్ సునీల్రావు, అటవీశాఖ కన్జర్వేటర్లు ఎంజె అక్బర్, సైదులు, మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి, అడిషనల్ డీసీపీలు శ్రీనివాస్, చంద్రమోహన్, కార్పొరేటర్ ఐలేందర్ యాదవ్, ఆర్ఐలు జానిమియా, శేఖర్, మల్లేశం, మురళీ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.