పనాజీ, మే 21: లైంగికదాడి ఆరోపణల కేసును ఎదుర్కొంటున్న తెహల్కా మాజీ సంపాదకుడు తరుణ్ తేజ్పాల్కు విముక్తి లభించింది. గోవాలోని మపుస జిల్లా కోర్టు ఆయనను నిర్దోషిగా తేల్చింది. 2013లో గోవాలో ఓ లగ్జరీహోటల్ లిఫ్టులో తేజ్పాల్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ తెహల్కాలో పనిచేసే ఓ మహిళా జర్నలిస్టు ఆయనపై ఫిర్యాదు చేశారు. అదే ఏడాది నవంబర్ 30న పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. 2014 జులై 1న సుప్రీంకోర్టు తేజ్పాల్కు బెయిల్ మంజూరు చేసింది. కేసుపై విచారణ కొనసాగించిన జిల్లా కోర్టు.. ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. దీనిని హైకోర్టులో సవాల్ చేస్తామని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తెలిపారు.