బంజారాహిల్స్,మే 20: బలవంతంగా బాలికను పార్కులోకి తీసుకెళ్లి తాళికట్టిన యువకుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతూ యూసుఫ్గూడలో నివాసం ఉంటున్న బాలిక(16)ను అదే ప్రాంతంలో ఉంటున్న రమేశ్(19)ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఈ నెల 5న బాలికను బలవంతంగా కృష్ణకాంత్పార్కుకు తీసుకువెళ్లి తాళికట్టాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లి ఈ నెల 17న రమేశ్ ఇంటికి వెళ్లి అతడిని నిలదీసింది. అయితే.. రమేశ్ తల్లిదండ్రులు ఆమెను దుర్భాషలాడారు. అనంతరం బాలిక తల్లి.. రమేశ్తోపాటు అతడి కుటుంబ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి.. నిందితుడు రమేశ్ను గురువారం అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.