మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం పట్ల టీఆర్ఎస్ నాయకులు హర్షతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని నెహ్రూ సెంటర్లో రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్, స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
స్థానికులకు స్వీట్లు పంచి, పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. వెనుకబడిన జిల్లా, అధికంగా గిరిజన జనాభా ఉన్న మహబూబాబాద్కు మెడికల్ కళాశాలను ప్రకటించడం పట్ల సీఎం కేసీఆర్కు.. మంత్రి సత్యవతి రాథోడ్ కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్కు గిరిజనులంతా జీవితాంతం రుణపడి ఉంటారని అన్నారు. మెడికల్ కళాశాల రావడంతో పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.