ముంబై: కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ డ్రైవ్ ఇన్ టీకా కేంద్రాన్ని మహారాష్ట్రలో శుక్రవారం ప్రారంభించారు. 60 ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ కోసం నాగ్పూర్లోని సీతాబుల్డి ప్రాంతలో గ్లోకల్ స్క్వేర్ మాల్ వద్ద దీనిని ఏర్పాటు చేశారు. దీంతో 60 ఏండ్లు పైబడిన స్థానికులు తమ వాహనాల్లో వచ్చి కరోనా టీకా వేయించుకుంటున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో కూడా ఇటీవల షాపింగ్ మాల్ వద్ద ఇలాంటి డ్రైవ్ ఇన్ వ్యాక్సిన్ సెంటర్ను ఏర్పాటు చేశారు.