సిద్దిపేట : లాక్ డౌన్ సందర్భంగా పోలీస్ కమిషనర్ డి. జోయల్ డెవిస్ సిద్దిపేట పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. పటిష్టమైన బందోబస్తు గురించి పోలీస్ అధికారులు, సిబ్బందికి తగు సూచనలు చేశారు. తెరచి ఉన్న రెండు షాపుల యజమానులతో మాట్లాడి వెంటనే బంద్ చేయించారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని షాపులు తెరిచి ఉండాలన్నారు. జిల్లాలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
నర్సుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి సత్యవతి రాథోడ్
లాక్ డౌన్ అమలును పరిశీలించిన మంత్రి ఐకే రెడ్డి
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పెద్ది
నర్సుల త్యాగం మానవీయమైనది : సీఎం కేసీఆర్
సేవకు మరో రూపం నర్సులు : మంత్రి శ్రీనివాస్ గౌడ్