అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. పిడుగుపాటుకు తండ్రీకుమార్తె మృతి చెందారు. హోళగుంద మండలం పెద్దహ్యట గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. గ్రామానికి చెందిన భోగరాజు(36) తన కుమార్తె రేవతి (7)తో మేకలను కాసేందుకు వెళ్లాడు.
మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఈదురుగాలులు, ఉరుములతో వర్షం ప్రారంభం కావడంతో ఇద్దరు చెట్టు కిందకు వెళ్లారు. వారు నిలబడిన చెట్టు సమీపంలోనే పిడుగుపడటంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 10 మేకలు సైతం మృత్యువాతపడ్డాయి. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.