ఢిల్లీ, మే 3: దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర సర్కారు తీసుకుంటున్న చర్యలు.. తీసుకోవాల్సిన చర్యలపై సుప్రీం కోర్టు ఎప్పటికప్పుడు విచారణ జరుపుతున్నది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీం కోర్టు విచారణ జరుపుతున్నది. తాజా విచారణ సందర్బంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేంద్ర,రాష్ట్రాలు ఈ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ సుప్రీం కోర్టు పలు సూచనలు చేసింది.
కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నసమయంలో సామూహిక సమావేశాలు, వేడుకలు అన్నింటిని కూడా బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకోవాలి. అలాగే దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఆక్సీజన్ నిల్వలు అధికంగా ఉండేల చర్యలు తీసుకోండి. కోవిడ్ కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి కనుక లాక్ డౌన్ పై కూడా ఆలోచిస్తే మంచిదని అత్యున్నత ధర్మాసనం సూచించింది. వైద్య సిబ్బందికి ఈ సమయంలో అన్ని వసతులు కల్పించాలి. అంతేకాదు వారి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలంటూ ఈ సందర్బంగా సుప్రీం కోర్టు సూచించింది.