హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీని ఆదరించి పార్టీ అభ్యర్థి నోముల భగత్కు అద్భుత విజయాన్ని అందించిన నాగార్జునసాగర్ ప్రజలకు సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇటీవల శాసనమండలి పట్టభద్రుల ఎన్నికలు.. తాజాగా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితంతో తెలంగాణ సమాజం కేసీఆర్, టీఆర్ఎస్ వెంటే ఉన్నట్లు స్పష్టమయిందని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీజేపీలు టీఆర్ఎస్కు పోటీయే కాదని తేటతెల్లం అయిందన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆరే తమ నాయకుడు అని, ఆయన నాయకత్వాన్నే విశ్వసిస్తున్నారని మంత్రి కొప్పుల అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.