అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని గుంటూర్ జిల్లాలో దారణం చోటు చేసుకుంది. భార్యతో వివాదం కారణంగా భర్త ఆమె గొంతు కోసి పరారయ్యాడు. గుంటూర్ జిల్లా పొన్నూర్లో ఈ విషాద ఘటన జరిగింది.
పొన్నూర్కు చెందిన మహిళకు ఆమె భర్తకు మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం ఇద్దరు మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన భర్త ఆమె గొంతు కోసం పరారరయ్యాడు.
రక్తపు మడుగులో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నబాధితురాలిని స్థానికులు చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు.
బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కో్సం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.