కోల్కతా: కరోనా మహమ్మారికి సంబంధించిన సెక్యూరిటీ ప్రోటోకాల్ను ఉల్లంఘించిన పలువురు అభ్యర్థులపై ఎన్నికల కమిషన్ కన్నెర్ర జేసింది. తమ ఆదేశాలను పట్టించుకోకుండా ఎనిమిదవ దశలో పోటీ చేస్తున్న 13 మంది అభ్యర్థులపై ఎన్నికల కమిషన్ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. మరో 33 మంది అభ్యర్థులకు షో కాజ్ నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కొవిడ్-19 ప్రోటోకాల్ను ఉల్లంఘించిన అభ్యర్థుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని కమిషన్ పూర్తి బెంచ్ అధికారులను ఆదేశించింది.
ఎఫ్ఐఆర్లు దాఖలు చేసిన 13 మంది అభ్యర్థుల్లో ఆరుగురు బీరుభం జిల్లాకు చెందినవారని అధికారులు తెలిపారు. ప్రోటోకాల్ అమలు విషయంలో కోల్కతా హైకోర్టు ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని జిల్లా ఎన్నికల అధికారులను సమావేశంలో ఈసీ ప్రశ్నించినట్లు సమాచారం. దీని తర్వాతనే కమిషన్ అధికారులు కఠినంగా వ్యవహరించడం ప్రారంభించారు. కరోనా మహమ్మారి ఉన్నప్పటికీ.. రాజకీయ పార్టీలు నిబంధనలను ఉల్లంఘించడంపై కోల్కతా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రోటోకాల్ ఉల్లంఘించే వారిపై ఏం చర్యలు తీసుకున్నారో తెలుపాలని అధికారులను ప్రశ్నించింది. కరోనా వ్యాప్తిని నివారించేందుకు చర్యలు తీసుకోకుండా ఇలా కొవిడ్ ప్రోటోకాల్ను ఉల్లంఘించడం నేరం కిందకే వస్తుందని హైకోర్టు స్పష్టం చేసింది. దాంతో ఎన్నికల కమిషన్ ఉల్లంఘనులపై చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించింది. ముందుగా 13 మందిపై ఎఫ్ఐఆర్ను నమోదు చేసిన ఈసీ.. మరో 33 మంది అభ్యర్థులకు కొవిడ్ ప్రోటోకాల్ ఉల్లంఘించారని ఆరోపణలు ఉన్న మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలని నోటీసులు జారీ చేసింది.
కరోనా ఎఫెక్ట్ : పూరీ జగన్నాథ్ ఆలయం మూసివేత
అమెరికన్ ఎక్స్ప్రెస్, డైనర్స్ క్లబ్పై ఆర్బీఐ నిషేధం
భారతదేశంలో పరిస్థితి ఘోరమైనది : డబ్ల్యూహెచ్ఓ
సుమిత్ర మహాజన్ చనిపోయారంటూ పుకార్లు.. కేసు నమోదు
రెమ్డెసివిర్కు బదులుగా నీళ్ల ఇంజెక్షన్.. రోగి మృతి
క్రికెట్ దేవుడు పుట్టాడీరోజే.. చరిత్రలో ఈరోజు
ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకుల రుణాలు.. ఎందుకంటే?!
కరోనా మహమ్మారి నుంచి పల్లెలు పదిలం : ప్రధాని పిలుపు
ఆక్సిజన్ సరఫరా అడ్డుకున్న వాళ్లను ఉరితీస్తాం.. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..