నందిపేట్ రూరల్, ఏప్రిల్ 23: మండలంలోని వెల్మల్ గ్రామంలో పల్లె ప్రగతి పనులను జిల్లా పంచాయతీ అధికారిణి జయసుధ శుక్రవారం పరిశీలించారు. విలేజ్పార్క్, వైకుంఠధామం, డంపింగ్యార్డు పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విలేజ్పార్క్ను అందంగా తీర్చిదిద్దారని సర్పంచ్ మచ్చర్ల సాయమ్మను అభినందించారు. ఈ సందర్భంగా డీపీవో మాట్లాడుతూ..కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ప్రతి గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ పనులు సక్రమంగా కొనసాగేలా చూస్తున్నట్లు తెలిపారు. ఉదయం, సాయంత్రం శానిటైజ్ చేయిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. డీపీవో వెంట సర్పంచ్ మచ్చర్ల సాయమ్మ, ఉపసర్పంచ్ ముప్పెడ నారాయణ, మాజీ సర్పంచ్ మచ్చర్ల పెద్ద గంగారాం, వార్డు సభ్యులు ఉన్నారు.
కరోనా టెస్టింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన డీపీవో
ధర్పల్లి, ఏప్రిల్ 23 : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కరోనా నిర్ధారణ పరీక్షల కేంద్రాన్ని డీపీవో జయసుధ శుక్రవారం తనిఖీ చేశారు. నిబంధనల మేరకు టెస్టులు చేస్తున్నదీ, లేనిది పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ టెస్టులు చే యాలన్నారు. పరీక్షలు పూర్తయిన తర్వాత టెస్టింగ్ కిట్లను దూర ప్రాంతాలకు తీసుకెళ్లి తగులబెట్టాలన్నారు. టెస్టుల కోసం వచ్చేవారు భౌతికదూరం పాటించేలా చూడాలన్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రతిఒక్కరూ సేవ, అంకితభావంతో పనిచేయాలని సూచించారు. డీపీవో వెంట సర్పంచ్ ఆర్మూర్ పెద్దబాల్రాజ్, ఎంపీవో రాజేందర్, సొసైటీ చైర్మన్ చెలిమెల చిన్నారెడ్డి, హెల్త్ సూపర్వైజర్ రాజేందర్, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లు, వార్డు సభ్యులు బద్దం నడ్పి గంగారెడ్డి, కార్యదర్శి సైఫొద్దీన్, నాయకుడు రామస్వామి ఉన్నారు.