అనేక పథకాల అమలు
పల్లెల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతుల కల్పన
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
రామాయిలో టీఆర్ఎస్లో చేరిన వివిధ పార్టీల నాయకులు
ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 23 : నియోజకవర్గంలోని గ్రామాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని రామాయి గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్, బీజేపీకి చెందిన 60 మంది నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరగా, వారికి ఆయన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. మా రుమూల గ్రామాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభు త్వం అనేక పథకాలు ప్రారంభించిందన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాల్లో ఉన్న సమస్యలను వారే పరిష్కరించుకునేందుకు ప్రతి నెలా నిధులు కేటాయిస్తున్నదని గుర్తుచేశారు. అలాగే గ్రామాల్లో తప్పనిసరిగా ఉండాల్సిన పల్లె పార్కు, శ్మశానవాటిక, డంప్యార్డులతో పాటు సీసీ రోడ్లు, డ్రైనేజీల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించిందని తెలిపారు. పేద ప్రజల కోసం రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. త్వరలో జరుగనున్న జడ్పీటీసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆరె నరేశ్కుమార్ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మకుండా ఎవరిని గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయో వారికే ఓటేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సమావేశంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, వైస్ ఎంపీపీ గండ్రత్ రమేశ్, జడ్పీటీసీ అభ్యర్థి ఆరె నరేశ్ కుమార్, నాయకులు సెవ్వ జగదీశ్, రామాయి గ్రామ సర్పంచ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
తీవ్ర విషాదంలో పూజా హెగ్డే.. కన్నీరు పెట్టుకున్న బుట్టబొమ్మ..
బిగ్ బాస్ ఆఫర్ కు నో చెప్పిన ఇంద్రజ..కారణమిదే..!