సంగారెడ్డి : అదుపుతప్పిన రెడిమిక్స్ ట్రక్కు ఆలయంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఎన్హెచ్ పురంలోని నాగులమ్మ ఆలయం వద్ద గురువారం చోటుచేసుకుంది. డ్రైవర్ వీల్పై నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తూ ప్రమాదం సమయంలో ఆలయం ఖాళీగా ఉంది. డ్రైవర్కు మాత్రం స్వల్ప గాయాలయ్యాయి. ట్రక్ దాదాపుగా గర్భగుడిలోకి ప్రవేశించడంతో ఆలయం తీవ్రంగా దెబ్బతింది. ఆర్సీపురం పోలీసులు కేసు నమోదు చేశారు.