నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 20 : జిల్లా వ్యాప్తంగా కరోనా నిర్ధారణ టెస్టులు, వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. వైరస్ లక్షణాలతో బాధపడుతున్న వారికి వైద్య సిబ్బం ది మంగళవారం టెస్టులు నిర్వహించారు. పాజిటివ్గా నిర్ధారణ అయినవారికి ఐసొలేషన్ కిట్లు అందజేసి సలహాలు, సూచనలు చేశారు. మరోవైపు వ్యాక్సినేషన్ చేపట్టారు.
కోటగిరిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 125 మందికి టెస్టులు నిర్వహించగా 25 మంది కి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని డాక్టర్ సమత తెలిపారు. పొతంగల్ పీహెచ్సీలో 160 మంది టెస్టులు నిర్వహించామని, 25 మంది వైరస్బారిన పడ్డారని వైద్య సిబ్బంది తెలిపారు.
డిచ్పల్లి మండలం ఘన్పూర్ పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్లో మొత్తం 152 మందికి టీకా వేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. మొత్తం వంద మందికి కొవిడ్ టెస్టులు నిర్వహించగా, ఆరుగురికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందన్నారు. మోస్రా పీహెచ్సీలో 174 మందికి టెస్టులు నిర్వహించామని, 26 మంది వైరస్బారినపడ్డారని వైద్యురాలు స్వప్న తెలిపారు.
దల్వాయి పీహెచ్సీలో 54 మందికి టెస్టులు నిర్వహించగా, 12 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు డాక్టర్ శుభాకర్ తెలిపారు. జక్రాన్పల్లి పీహెచ్సీలో 148 మందికి టెస్టులు నిర్వహించగా 23 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని, 118 మందికి టీకా వేశామని వైద్యాధికారి రవీందర్ తెలిపారు. వర్ని కమ్యూనిటీ వైద్యశాలలో 124 మందికి టెస్టులు నిర్వహించాని, 27 మంది వైరస్బారినపడ్డారని డాక్టర్ వెంకన్న తెలిపారు. 46మందికి టీకా వేశామన్నారు.
నందిపేట్ పీహెచ్సీలో 148 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, ఎనిమిది మం దికి, బోధన్ మండలం సాలూరా పీహెచ్సీలో 273 మందికి టెస్టులు నిర్వహించగా, 63 మం దికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు అజ య్, రేఖ తెలిపారు.
రెంజల్ పీహెచ్సీలో 128 మందికి టెస్టులు నిర్వహించగా, 23 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. మోర్తాడ్ సీహెచ్సీలో 127 మందికి టెస్టులు నిర్వహించగా ఏడుగురికి, కమ్మర్పల్లి పీహెచ్సీలో 54మందికి టెస్టులు నిర్వహించగా 10 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యులు అజయ్కుమార్, నరసింహస్వామి తెలిపారు. చౌట్పల్లిలో 121 మందికి టెస్టులు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ రతన్సింగ్ తెలిపారు. బోధన్లోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో 299మందికి పరీక్షలు నిర్వహించగా 114మందికి, రాకాసీపేట్ అర్బన్ హెల్త్సెంటర్లో 103మందికి పరీక్షలు నిర్వహించగా 37మందికి, పాన్గల్లీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 120మందికి పరీక్షలు నిర్వహించగా 46 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని వైద్యాధికారులు తెలిపారు.
ఎడపల్లి పీహెచ్సీలో 237 మందికి కొవిడ్ టెస్టులు నిర్వహించగా 28 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఆర్మూర్లో 32 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మాక్లూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో టెస్టులు నిర్వహించామని 38మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యిందని మాక్లూర్, కల్లడి పీహెచ్సీల వైద్యులు సంజీవ్రెడ్డి, సిఖిందర్నాయక్ తెలిపారు.