రాంచి: జార్ఖండ్లో దారుణం జరిగింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఒక మహిళను, ఆమె ఇద్దరు కొడుకులను అత్యంత దారుణంగా హత్యచేశారు. గొడ్డళ్లతో విచక్షణారహితంగా నరికి చంపేశారు. జార్ఖండ్ రాష్ట్రం గర్హ్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. సదరు మహిళ తన ఎనిమిదేండ్లు, ఆరేండ్ల వయసున్న ఇద్దరు కొడుకులతో ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయం చూసి గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఇంట్లో చొరబడ్డారు.
ఇంట్లో ఉన్న మహిళను, ఆమె ఇద్దరు కొడుకులను గొడ్డళ్లతో నరికిచంపారు. ఘటన సమయంలో సదరు మహిళ భర్త.. నిర్మాణంలో ఉన్న తమ కొత్త ఇంటి పనులను పర్యవేక్షించేందుకు వెళ్లాడు. ఆయన తిరిగి వచ్చేసరికి భార్య, ఇద్దరు పిల్లలు విగతజీవులుగా పడివున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి.
మునక్కాయల కన్న మునగాకే మిన్న..!
కేంద్రమంత్రి జితేంద్రసింగ్కు కరోనా
మే 1 వరకు తెలంగాణలో నైట్ కర్ఫ్యూ
సంచలన నిర్ణయం తీసుకున్న ఛార్మీ
ఐసీఎస్ఈ 10వ బోర్డు పరీక్షలు రద్దు..
వ్యాక్సిన్లపై దిగుమతి సుంకం ఎత్తివేత!