లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి హనుమాన్ మిశ్రా కొవిడ్తో పోరాడుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో చికిత్స పొందుతున్న ఆయనకు క్యాన్సర్ కూడా ఉంది. కొద్ది రోజుల కిందట కరోనా సోకినట్లు తేలడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో వారాంతాల్లో కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే.