న్యూఢిల్లీ: కన్నడ సాహిత్యరంగ ప్రముఖుడు, రచయిత, నిఘంటుకర్త వెంకటసుబ్బయ్య మృతికి ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలిపారు. కన్నడ భాష అభివృద్ధి కోసం వెంకటసుబ్బయ్య ఎంతో కృషి చేశారని ప్రధాని కొనియాడారు. ఆయన మరణం కన్నడ సాహితీరంగానికి తీరనిలోటు అని పేర్కొన్నారు. వెంకటసుబ్బయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.