దేశమంతటా కోవిడ్ విలయతాండవం చేస్తోంది. లక్షల్లో రోగులు..వేలల్లో మరణాలతో రోజుకో రికార్డ్ నమోదవుతోంది. ఏ రాష్ట్రంలో చూసినా భయానక వాతావరణమే ఉంది. రోగులతో నిండిపోతున్న హాస్పిటల్స్ ఓవైపు , మరోవైపు శవాలతో స్మశానవాటికలు 24గంటలు పనిచేస్తూనే ఉన్నాయి. నిన్నటివరకు ఉత్తరాదిన ఉంటే ఇప్పుడు దక్షిణాదిన కూడా స్మశానవాటికల్లో కోవిడ్ మృతదేహాలు బారులుతీరాయి.
బెంగళూరు ఎలహెంక స్మశానవాటికకి భారీగా కోవిడ్ మృతదేహాలు చేరుకుంటున్నాయి. డెడ్ బాడీలతో అంబులెన్స్ ల క్యూ లైన్ పెరిగిపోతోంది. దాదాపు నాలుగైదు గంటలకు పైగానే దహాన సంస్కారాలకు టైమ్ పడుతుండటంతో బంధువులు సైతం అల్లాడిపోతున్నారు. పరిస్థితి రోజురోజుకి చేయి దాటి పోతోందని , 24గంటలు పనిచేసినా ఇంకా డెడ్ బాడీల క్యూలైన్ మాత్రం తగ్గడం లేదంటున్నారు స్మశానవాటిక అధికారులు.