కోల్కతా: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం బీజేపీ బయటి వ్యక్తులను రాష్ట్రానికి తీసుకురావడంవల్లే పశ్చిమబెంగాల్లో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతాబెనర్జీ ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాల వ్యక్తులు బెంగాల్కు రాకుండా నిషేధం విధించాలని ఆమె ఎన్నికల సంఘాన్ని కోరారు.
నదియా జిల్లాలో ఇవాళ ఎన్నికల ప్రచారం నిర్వహించిన మమత.. బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘ప్రధాని, ఇతర బీజేపీ నేతలు రాష్ట్రంలో ప్రచారానికి వస్తే మాకు అభ్యంతరం లేదు. కానీ వారి ర్యాలీల్లో పోడియం, వేదికలు సిద్ధం చేయడానికి భాజపా బయటి రాష్ట్రాలకు చెందిన ప్రజలను ఎందుకు తీసుకొస్తున్నది? స్థానిక కూలీలను, డెకరేటర్లను ఉపయోగించుకోవచ్చు కదా! కరోనా ఉద్ధృతి ఎక్కువగా ఉన్న గుజరాత్ లాంటి రాష్ట్రాల నుంచి వ్యక్తులను తీసుకురావడం వల్లే బెంగాల్లో కొవిడ్ విజృంభిస్తున్నది. దీనిపై నేను ఈసీకి ఫిర్యాదు చేస్తా. బయటి వ్యక్తులు రాష్ట్రానికి రాకుండా చూడాలని కోరతా’ అని మమత వ్యాఖ్యానించారు.
ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకోవడానికే బీజేపీ తనపై దాడి చేయించిందని మమతాబెనర్జి మరోసారి దుయ్యబట్టారు. అయితే ప్రజల ఆశీర్వాద బలంతోనే తాను ఆ ప్రమాదం నుంచి బయటపడ్డానని పేర్కొన్నారు. తన కాలి గాయం దాదాపు తగ్గిపోయిందని ఆమె తెలిపారు.
ఇవికూడా చదవండి..
తెలంగాణలో కొత్తగా 3,840 కరోనా కేసులు
పాదాల పగుళ్లు పోవాలంటే ఈ చిట్కాలు పాటించాలి..!
పండుగకు పుట్టింటికి కూతురు.. కాల్చిచంపిన కన్నతండ్రి..!
సీబీఐ మాజీ చీఫ్ రంజిత్ సిన్హా మృతి
కోడిగుడ్డులో పచ్చసొనను పడేస్తున్నారా.. అయితే ఇది చదవాల్సిందే..!
30 కోట్లతో స్వర్గ సీమను నిర్మించుకున్న కంగనా రనౌత్
కేంద్ర పోలీసు బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు