న్యూఢిల్లీ: పద్దెనిమిది ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కొవిడ్-19 వ్యాక్సిన్ ఇవ్వాలంటూ ఇవాళ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగినందున ఇది అత్యవసరమని న్యాయవాది రష్మీ సింగ్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ప్రత్యేకించి యువకులు, ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న అందరికీ విస్తృతంగా వ్యాక్సినేషన్ అందించాలని, తద్వారా సెకండ్ వేవ్లో కరోనా కేసులు ప్రబలకుండా నిలువరించవచ్చని ధర్మాసనానికి పిటిషనర్ నివేదించారు.
18 ఏండ్లకుపైన 45 ఏండ్లకు లోపు వారికి వ్యాక్సిన్ ఇవ్వకుండా తిరస్కరించడం నిరంకుశమని, వివక్షపూరితమని పిటిషనర్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ను తిరస్కరించడమంటే జీవించే హక్కును, ఆరోగ్య హక్కును తిరస్కరించడమేనని పిటిషనర్ ధర్మాసనానికి నివేదించారు. కొవిడ్-19 వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహా పలువురు నిపుణులు డిమాండ్ చేసిన విషయాన్ని కూడా పిటిషనర్ గుర్తుచేశారు.
ఇవికూడా చదవండి..
తెలంగాణలో కొత్తగా 3,840 కరోనా కేసులు
పాదాల పగుళ్లు పోవాలంటే ఈ చిట్కాలు పాటించాలి..!
పండుగకు పుట్టింటికి కూతురు.. కాల్చిచంపిన కన్నతండ్రి..!
సీబీఐ మాజీ చీఫ్ రంజిత్ సిన్హా మృతి
కోడిగుడ్డులో పచ్చసొనను పడేస్తున్నారా.. అయితే ఇది చదవాల్సిందే..!
30 కోట్లతో స్వర్గ సీమను నిర్మించుకున్న కంగనా రనౌత్
కేంద్ర పోలీసు బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు