ధర రూ.7.21 లక్షలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ట్రాక్టర్ల తయారీలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్.. మార్కెట్లోకి సొలిస్ హైబ్రిడ్ 5015 ట్రాక్టర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జపాన్కు చెందిన యన్మార్ అగ్రిబిజినెస్ కో లిమిటెడ్తో కలిసి అభివృద్ధి చేసిన ఈ ట్రాక్టర్ ధరను రూ.7.21 లక్షలుగా నిర్ణయించింది. దీనిలో అమర్చిన లిథియమ్-అయాన్ బ్యాటరీ మూడు గంటల్లో పూర్తిగా రీచార్జి కానున్నది. 50 హెచ్పీ శక్తి కలిగిన ఈ ట్రాక్టర్తో రైతులకు మూడు రకాల ప్రయోజనాలు కలుగుతాయని కంపెనీ వర్గాలు చెప్తున్నాయి.