వరంగల్ : శ్రీప్లవ నామ సంవత్సరంలో మంచి వర్షాలు కురిసి, సమృద్ధిగా నీరు వచ్చి, మరిన్ని పంటలు పండి, రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని పంచాంగ శ్రవణ కర్తలు చెబుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు.
అలాగే, వరంగల్ కూడా మంచి అభివృద్ధి సాధిస్తుందని అంటున్నారని వారి మాటలు పొల్లుపోకుండా, వరంగల్ని ప్రమాణ పూర్వకంగా మంచి అభివృద్ధి చేసి తీరుతామని వారు తెలిపారు.ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని హనుమకొండ వేయి స్తంభాల ఆలయంలో రుద్రేశ్వరుడిని దర్శించుకున్నారు.
కరోనా అంతమొంది, ఎలాంటి భయాందోళనలు లేకుండా హాయిగా ఆయురారోగ్యాలతో తిరిగే రోజులు రావాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా పంచాంగ కర్త, కవులను సత్కరించారు.
ఇవి కూడా చదవండి..
సాగర్ వెనుకబాటుకు జానారెడ్డే కారణం
దివ్యాంగులకు అండగా ఎమ్మెల్సీ కవిత
రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారు