హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
నీరు సమృద్ధిగా ప్రవహించడం ఈ సంవత్సర ప్రాధాన్యంగా పంచాంగం చెప్తున్న నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయానికి సాగునీరు మరింతగా లభించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రజలందరూ ఉగాది పండుగను ఆనందోత్సాహాల మధ్య కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని కోరారు. తెలుగు సంవత్సరంలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు.
కరోనా మహమ్మారిని ధైర్యం ఎదుర్కొని విజయం సాధించాలని, ప్రతి ఒక్కన ఆరోగ్యంగా జీవనాన్ని కొనసాగించాలని ఆయన ఆకాంక్షించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి