అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ రాజలింగు
ఉట్నూర్ రూరల్, ఏప్రిల్ 9 : అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (సీసీఎఫ్) రాజలింగు అన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని బీర్సాయిపేట్ అటవీ క్షేత్ర కార్యాలయంలో ఆజాదీకా అమృత్ మహోత్సవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స మావేశంలో మాట్లాడారు. మానవులతో పా టు అన్ని రకాల ప్రాణులు అడవులపై ఆధారపడి ఉండాల్సిందేనన్నారు. అటవీ సంపద అంతరించిపోకుండా కాపాడుకోవాలని సూ చించారు. ఆయుర్వేదానికి సంబంధించిన ఎన్నో మొక్కలు అటవీలో లభిస్తాయన్నా రు. ఎందరో జీవనోపాధికి అటవీ కారణమవుతుందని తెలిపారు. అలాగే సహజ సిద్ధంగా దొరికే విత్తనాలు సేకరించి, మొక్క లు నాటాలని సూచించారు. రాష్ట్ర సర్కారు మొక్కలను పెంచేందుకు 10 శాతం నిధులు కేటాయిసున్నదన్నారు. ఆరేండ్లలో సుమారు 200 కోట్ల మొక్కలు నాటిందని తెలిపారు. అప్పటి నుంచి 3శాతం అడవులు పెరిగాయన్నారు. అలాగే అటవీ శాఖ ఆధ్వర్యంలో వ న్యప్రాణుల సంరక్షణకు గడ్డి పెంపకం, బౌం డరీల ఏర్పాటు, చెక్డ్యాంల నిర్మాణం, అడవులు కాలిపోకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సిబ్బంది రెండురోజుల పాటు 14 కిలోమీటర్లు కాలినడకన అడవిలోకి వెళ్లి, వివరాలు సేకరించి చర్చించుకోవాలని సూచించారు. అనంతరం జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఎంపీపీ పంద్ర జైవంత్రావు, సబ్డీఎఫ్వో రాహుల్ కిషన్ జాదవ్, వన్యప్రాణి సంరక్షుడు, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, ఎఫ్ఆర్వో గులామొద్దీన్, సిబ్బంది పాల్గొన్నారు.