కోల్కతా : కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సాయంత్రం ఆయా రాష్ర్టాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల అధిపతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డుమ్మా కొట్టే అవకాశం ఉంది. ఆమె స్థానంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అల్పన్ బందోపాధ్యాయ హాజరు కానున్నట్లు సమాచారం. మమత ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతోనే ఈ మీటింగ్కు హాజరు కాలేకపోతున్నారని తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్య రసవత్తరమైన పోటీ నెలకొంది. 294 అసెంబ్లీ స్థానాలున్న బెంగాల్లో 8 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మూడు దశల ఎన్నికల పూర్తయ్యాయి. ఏప్రిల్ 29న చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది.