మాడ్గులపల్లి, ఏప్రిల్ 5 : నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధి టీఆర్ఎస్ పాలనలోనే జరిగిందని, గత ప్రభుత్వాలు చేసిందేమీ లేదని ఆర్మూర్, భువనగిరి ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని పూసలపహాడ్ గ్రామంలో సోమవారం ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, లక్షల ఎకరాల్లో సాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. నోముల భగత్ గెలుపు కోసం కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో షేక్ ఖాశీం, పోతురాజు రాములు, రమేశ్, అర్జున్రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.
యువత క్రీడల్లో రాణించాలి..
గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, శేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని కుక్కడం గ్రామంలో అంబేద్కర్, జగ్జీవన్రామ్ యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యువత క్రీడల్లో మెరుగైన ప్రతిభ కనబరిస్తే ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు నల్లమోతు సిద్ధార్థ, సర్పంచ్ గోవిందరెడ్డి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మోషన్ అలీ, వేములపల్లి పీఏసీఎస్ చైర్మన్ రాములు గౌడ్, నాయకులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
భూ కుంభకోణంలో యెడియూరప్పకు ఊరట
మంత్రి ఎర్రబెల్లిని కలిసిన ఉద్యోగ సంఘాల నేతలు
నిరుపేదలకు అండగా.. కల్యాణలక్ష్మి