హైదరాబాద్ : నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న టీఆర్ఎస్ సీనియర్ నాయకుడిని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన గ్రామానికి చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కె.గంగారెడ్డికి మూత్రపిండాల మార్పిడి జరిగింది.
విషయం తెలుసుకున్న మంత్రి గంగారెడ్డిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొన్నారు. ఆరోగ్యం మెరుగయ్యేందుకు మరింత శ్రద్ధ తీసుకోవాలన్నారు. అవసరమైన వసతులు కల్పించాలని సంబంధిత డాక్టర్లు, నర్సులను మంత్రి కొప్పుల సూచించారు.
ఇవి కూడా చదవండి..
రైతు వేదికలను సద్వినియోగం చేసుకోవాలి
జగ్జీవన్ రామ్ సేవలు మరువలేనివి : మంత్రి శ్రీనివాస్గౌడ్
గ్రామీణాభివృద్ధిలో స్థానిక సంస్థల పాత్ర కీలకం : ఎమ్మెల్సీ కవిత