రాజ్కోట్: జాతీయ సీనియర్ మహిళల వన్డే చాంపియన్షిప్లో మిథాలీరాజ్ సారథ్యంలోని రైల్వేస్ జ్టటు మరోసారి విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో రైల్వేస్ జట్టు 7 వికెట్ల తేడాతో జార్ఖండ్ను చిత్తుచేసింది. ఇప్పటి వరకు 14 సార్లు ఈ టోర్నీ నిర్వహించగా.. అందులో రైల్వేస్ టైటిల్ దక్కించుకోవడం 12వ సారి. మొదట జార్ఖండ్ 50 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్యఛేదనలో పూనమ్ రౌత్ (59), మేఘన (53) అర్ధశతకాలతో రాణించడంతో రైల్వేస్ 37 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది.
ఇవి కూడా చదవండి..