పరిమిత సంఖ్యలో పాల్గొన్న భక్తులు
యాదాద్రీశుడి ఖజానాకు రూ. 5,88,584 ఆదాయం
యాదాద్రి, ఏప్రిల్4: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో ఆర్జిత పూజలను అర్చకులు శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఆదివారం తెల్లవారుజాము మూడు గంటల నుంచి స్వామివారి నిత్యారాధనలు మొదలయ్యాయి. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేసి హారతి నివేదనలు అర్పించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా వారం రోజుల అనంతరం పునః ప్రారంభమైన నిత్యకల్యాణోత్సవం, సుదర్శన నారసింహహోమంలో భక్తులు కొవిడ్ నిబంధనలు పాటి స్తూ పరిమిత సంఖ్యలో పాల్గొన్నారు.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వా మి బాలాలయంలో ఆర్జిత పూజలు అర్చకులు శాస్ర్తో క్తంగా నిర్వహించారు. ఆదివారం తెల్లవారు జాము మూడు గంటల నుంచి స్వామి వారి నిత్యారాధనలు మొదలయ్యాయి. నిజాభిషేకంతో స్వామి వారి ఆరాధ నలు ప్రారంభించారు. ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం మూడు గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధి స్తూ ప్రత్యేక పూజలు చేసి, హారతి నివేదనలు అర్పిం చారు. సుదర్శన హోమం ద్వారా శ్రీవారిని కొలిచారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా వారం రోజుల అనంతరం పు నఃప్రారంభమైన నిత్యకల్యాణోత్సవం, సుదర్శన నార సింహ హోమంలో భక్తులు కొవిడ్ నిబంధనలు పాటి స్తూ పాల్గొన్నారు. దేవేరులను ముస్తాబు చేసి గజ వా హనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు. లక్ష్మీ సమేతుడైన నారసిం హుడిని ఆరాధిస్తూ సుమారు గం టన్నరకు పైగా కల్యాణ తంతు జరిపారు. కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి బాలాలయ ముఖ మండ పంలో భక్తులకు అభిముఖంగా అధిష్ఠించి కల్యాణ తంతు నిర్వహించారు. సాయంత్రం అలంకార జోడు సేవలు నిర్వహించారు. మండపంలో అష్టోత్తర పూజ లు జరిపారు. పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం జరిపారు. నవగ్రహాలకు తైలాభిషేకం జరిపారు. అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించా రు. స్వామివారి సేవలో భక్తులు పరిమిత సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం సెలవురోజు అయినప్పటికీ కరో నా దృష్ట్యా భక్తుల సంఖ్య మరింతగా తగ్గింది.
ఖజానాకు రూ. 5,88,584 ఆదాయం
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి ఖజానాకు రూ. 5,88, 584 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 27,890, రూ. 100 దర్శనాలతో రూ. 1,800, వీఐ పీ దర్శనాలతో రూ.17,400, సుప్రభాతం ద్వారా రూ.1,400, ప్రచారశాఖ ద్వారా రూ. 950, క్యారీ బ్యాగులతో రూ. 2,650, వత్రాలతో రూ. 19,500, కల్యాణ కట్టతో రూ. 23,600, ప్రసాద విక్రయాలతో రూ. 3,72,100, వాహన పూజలతో రూ. 5,500, టోల్గేట్ ద్వారా రూ. 880, అన్నదాన విరాళంతో రూ. 17,348, సువర్ణ పుష్పార్చనతో రూ.31,676, యాదరుషి నిలయంతో రూ. 54,000, పాత గుట్టతో రూ. 9,390, ఇతర విభాగాలతో రూ. 2,500తో కలి పి స్వామి వారికి రూ. 5,88,584 ఆదాయం లభిం చిందని ఆలయ అధికారులు తెలిపారు.
స్వామివారిని దర్శించుకున్న ‘నిసా’ సంచాలకుడు సీవీ ఆనంద్
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని జాతీయ పారి శ్రామిక భద్రత అకాడమీ(నిసా)సంచాలకుడు సీవీ ఆనంద్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ అర్చకులు, అధికా రులు ప్రత్యేక స్వాగతం పలికి స్వామి వారి ఆశీర్వచ నం, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఇవి కూడా చదవండి
డబ్బింగ్ మొదలు పెట్టిన పెళ్లికొడుకు..
సర్కారు వారి పాట షెడ్యూల్ అంతా చిందర వందర
దారుణం : ఈత రాదని తెలిసినా..నీళ్లలోకి తోశారు