ఎండలు ఎక్కువ కావడంతో పెరుగుతున్న వినియోగం
ఉక్కపోత నుంచి జనం ఉపశమనం
బోథ్, ఏప్రిల్ 4: మార్చి మూడో వారం నుంచే ఎండలు పెరగడంతో జనాలు ఇల్లు దాటి బయటకు రాలేకపోతున్నారు. ఉపశమనం కోసం కూలర్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. బోథ్లో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ షాపుల్లో వివిధ రకాల కూలర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. అల్యూమినియం, కాపర్ వైండింగ్తో తయారు చేసిన మోటర్లతో కూడిన కూలర్లు విక్రయిస్తున్నారు. రూ.1300 నుంచి రూ.15వేల వరకు కూలర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సారి ఎండలు ఎక్కువగా ఉండడంతో కూలర్ల అమ్మకాలు పెరిగాయి. మధ్యాహ్నం జనం బయటకు రావాలంటే భయపడుతున్నారు. గత ఏడాది కరోనా ప్రభావంతో అమ్మకాలు నామమాత్రంగా జరిగాయి. కూలర్ల తయారీకి ఉపయోగించే ముడి సరుకులు పెరగడంతో కూలర్ల ధరలు కూడా పెరిగాయని అమ్మకందారులు చెబుతున్నారు. ఈ సారి వేసవిలో వ్యాపారం బాగా జరుగుతున్నందున నమ్మకంతో వ్యాపారులు ఉన్నారు.
ఇవి కూడా చూడండి..
గూగుల్లో వీటిని అసలు సెర్చ్ చేయకూడదు!