పెద్దవూర: సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు, పెద్దవూర సర్పంచ్ కర్నాటి విజయ భాస్కర్ రెడ్డి భౌతికకాయానికి హోంమంత్రి మహమూద్ అలీ నివాళులర్పించారు. పెద్దవూరలోని ఆయన నివాసాకి వెళ్లిన మంత్రి.. విజయ భాస్కర్ రెడ్డి తల్లి, పిల్లలను ఓదార్చారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. పెద్దవూర సర్పంచ్ జనరల్కు రిజర్వ్ కావడంతో టీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డు సృష్టించారని చెప్పారు. మొత్తం 12 వార్డులను గెలిపించుకొని క్లీన్ స్వీప్ చేశారని గుర్తుచేసుకున్నారు.
గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కర్నాటి విజయ భాస్కర్ రెడ్డి నిన్న హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల మంత్రి జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సంతాపం తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..