న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల దాడిలో ఐదుగురు భద్రతాసిబ్బంది ప్రాణాలు కోల్పోవడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తంచేశారు. ఎన్కౌంటర్లో ప్రాణ త్యాగాలు చేసిన ఆ అమరులకు తాను శిరసు వంచి మొక్కుతున్నానని చెప్పారు. వారి పరాక్రమాన్ని జాతి ఎప్పటికీ మర్చిపోదన్నారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అభివృద్ధికి అడ్డుపడుతూ, శాంతి సామరస్యాలకు విఘాతం కలిగిస్తున్న మావోయిస్టులపై ఇకపై కూడా పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
అదేవిధంగా ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి ఫోన్ చేసిన అమిత్ షా భద్రతా బలగాలపై మావోయిస్టుల దాడికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఛత్తీస్గఢ్కు వెళ్లి అక్కడి పరిస్థితులను పర్యవేక్షించాలని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ను అమిత్ షా ఆదేశించారు. కాగా, సుక్మా-బీజాపూర్ సరిహద్దుల్లో భద్రతాబలగాలపై మావోయిస్టులు ఆకస్మికంగా దాడి చేయడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు షాక్.. స్టార్ ప్లేయర్కు కరోనా
దేశంలో కరోనా ఉగ్రరూపం.. 24గంటల్లో 93,249 కేసులు
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్కు కరోనా
నీళ్లను కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చని మీకు తెలుసా..?