ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి
గద్వాల, ఏప్రిల్ 3: ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు బీమా పథకం రైతు కుటుంబాలకు చేయూత అని ఎమ్మెల్యే బం డ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు శనివారం రైతు బీమా చెక్కుతోపాటు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రభుత్వం రైతులకు చేయూతనివ్వాలనే ఉద్ధేశంతో రైతు బంధు, రైతు బీమా పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. రైతుకు గుంట పొలం ఉన్న మృతిచెందితే అతని కుటుంబానికి రూ.5లక్షలు ప్రభుత్వం అందిస్తున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే సాయా న్ని లబ్ధిదారులు వినియోగించుకోవాలని సూచించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం బీమా, రైతుబంధు ప్రవేశ పెట్టిందని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స చేయించుకోలేని వారికి సీఎంఆర్ఎఫ్ కల్పతరువుగా మారిందని చెప్పారు. ప్రభుత్వం అందించే సహాయంతో పేదలు కార్పొరేట్ దవాఖానల్లో చికిత్స చేయించుకోవడానికి అవకాశం ఏర్పడిందన్నారు. అనంతరం కేటీదొడ్డి మండలం మల్లాపురం గ్రామానికి చెందిన నర్సింహులు మరణించగా ఆయన కుటుంబానికి రూ.5లక్షల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. అదే విధంగా గట్టు మండలం మాచర్ల గ్రామానికి చెందిన మహిమూద్ చికిత్స నిమిత్తం మంజూరైన రూ.60వేల చెక్కు, అదే మండలం గొర్లఖాన్దొడ్డి గ్రామానికి చెందిన దౌలత్బీ చికిత్స నిమిత్తం మంజూరైన రూ.60వేల చెక్కును గద్వాల పట్టణం గంజిపేటకు చెందిన మహేశ్కురూ.32వేల చెక్కును ఎమ్మెల్యే బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరమ్మ, జెడ్పీటీసీ రాజశేఖర్, సర్పంచులు శంకరమ్మ, తిరుమలేశ్, ఎంపీటీసీ తిమ్మప్ప, నాయకులు ఇమామ్ వలి మల్దకల్, గోవింద్, జయన్న, నర్సింహులు, నల్లారెడ్డి ఆంజనేయులు పాల్గొన్నారు.