ముంబై: మరో ఐదు రోజుల్లో ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభంకానుండగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. యువ స్పిన్నర్కు కరోనా సోకిందని ఫ్రాంఛైజీ ధ్రువీకరించింది.వాంఖడే వేదికగా ఢిల్లీ తన తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్తో ఆడనుంది.
‘దురదృష్టవశాత్తు, అక్షర్కు కరోనా పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నాడు. కొవిడ్ నిబంధనలన్నింటినీ పాటిస్తున్నమని’ ఫ్రాంఛైజీ అధికారి తెలిపారు.ఐపీఎల్ కొవిడ్ ప్రొటోకాల్స్ ప్రకారం..బయో బబుల్కు ఆవల అక్షర్ పది రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాల్సి ఉంటుంది.
టోర్నీ ప్రారంభానికి ముందు కరోనా బారినపడి రెండో ఆటగాడు అక్షర్. ఇంతకుముందు కోల్కతా నైట్ రైడర్స్ బ్యాట్స్మన్ నితీశ్ రాణాకు కరోనా సోకగా, ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది.